Breaking News
Corona

ఆ రాష్ట్రాల్లో కరోనా కల్లోలం .. ఐసోలేషన్‌లో వైద్యులు..!

కరోనా..ఈ పేరు వింటూనే జనాల్లో ఏదో తెలియని భయము. ఈ వైరస్ దాదాపు ఒకటిన్నర సంవత్సరము అందరి జీవితాలు మార్చేసింది.అలాంటిది తిరిగి మళ్ళి భయం కలిగిస్తా ఉంది. కరోనా ఉప్పెనై ముంచుకొస్తుంది. కొన్ని వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నాయి. దీనితో పాటు ఇప్పుడు కొత్తగా ప్రజలను కాపాడే డాక్టర్లుకు ఈ వైరస్ ఎక్కువ సోకుతుంది.రెండు రాష్ట్రాల్లో వందలాది మంది డాక్టర్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

 ఈ కోవిడ్ కేసులు చూస్తుంటే దేశంలో  మళ్ళి థర్డ్ వేవ్‌ మొదలయ్యింది అనే అనుమానం అందరి మదిని భయం గుప్పిటిలో పెడుతుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకు కోవిడ్, ఒమిక్రాన్ కేసులు అంతగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రలలో కొన్ని గంటల, రోజుల సమయములోనే కరోనా మరియు ఓమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వలు సాధ్యమైనంత వరకూ ప్రజలు గుమిగూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, పార్కులను కూడా క్లోజ్ అయ్యాయి. తాజాగా రెండు రాష్ట్రాల్లో డాక్టర్లు కూడా కోవిడ్ బారిన పడ్డారు. అందులోనూ వందల సంఖ్యలో డాక్టర్లకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

పశ్చిమబెంగాల్, బీహార్‌లలో 180 మందికి పైగా వైద్యులకు కోవిడ్ సోకింది. పశ్చిమ బెంగాల్‌లో మూడు వేర్వేరు ఆస్పత్రులకు చెందిన వంద మందికి పైగా డాక్టర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య శా ఖ అధికారులు తెలిపారు. వీరిలో 70 మంది వైద్యులు కలకత్తా జాతీయ వైద్య కాలేజ్, ఆస్పత్రికి, 24 మంది చిత్తరంజన్ సేవా సదన్‌కు చెందిన వారు. రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీకి చెందిన 12 మంది డాక్టర్లుకు కూడా కరోనా సోకింది. ఇక బీహార్ పాట్నాలో నలంద వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందిన 87 మంది డాక్టర్లకు కరోనా సోకింది. వారిని ఆస్పత్రిలోని క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో చాలామంది స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఐదుగురు ఆస్పత్రిలో చేరారు. వీరంతా పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 96వ సదస్సుకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. అయితే వారి కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కోవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న డాక్టర్లు వైరస్ బారిన పడడం కలకలం రేపుతుంది. సెకండ్ వేవ్‌లోనూ దేశంలో చాలా మంది డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు. కొందరు స్వల్ప లక్షణాలతో బయటపడినా కొద్దిమంది మాత్రం కోవిడ్‌కు బలయ్యారు. దీనితో పాటు ఇప్పుడు కొత్తగా ప్రజలను కాపాడే డాక్టర్లుకు ఈ వైరస్ ఎక్కువ సోకుతుంది.ఈ సమయములో డాక్టర్లుకి కరోనాకి బలి అవ్వడం చూస్తుంటే దేశంలో కరోనా ఎంత ఎక్కువ వుందో అర్థము అవుతా ఉంది. దేశంలో కొత్తగా 33,750 కోవిడ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పుడు 15 ఏళ్లు దాటిన పిల్లలకు టీకాలు ఇవ్వడం ప్రారంభించింది.

 

About rajak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *